సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబులదేవర చెరువు:- విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో విశాఖఉక్కు ప్రవేటికరణను ఆపాలని బుధవారం సిపిఐ నాయకులు అద్వర్యం లో ఓబులదేవర చెరువు తహసీల్దారు కార్యాలయము ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈసందర్బంగా సిపిఐ పుట్టపర్తి నియోజకవర్గ కార్యదర్శి ఆంజనేయులు మాట్లాడుతూ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయాలని చూస్తున్న ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వివరించడం సిగ్గుచేటని అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ కేంద్ర సంస్థలను ప్రవేట్ అప్పజెప్పేందుకు కంగణం కట్టుకున్నాడని అతి పెద్ద ఉక్కు ప్రైవేటుకు అప్పజెప్పడాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో దశద్దాల నుంచి కాపాడుకుంటూ వస్తున్న ఇవాళ ప్రైవేటుకు అప్పజెప్పడం సిగ్గుచేటని 20 వేల మంది కార్మికులు పొట్ట గొట్టే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆరోపించారు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కనీసం ఆపే ప్రయత్నం కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేయలేదని ఆరోపించారు. ఇప్పటికైనా విశాఖ ఉక్కును రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహించేందుకు బాధ్యత తీసుకోవాలని డిమాండ్ రోజు రాష్ట్రవ్యాప్తంగా విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం సంఘాలు రాజకీయ పార్టీలు చేస్తుంటే ప్రభుత్వం పోలీసులు చేత అరెస్ట్ చేయించడం దుర్మార్గమని ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి విశాఖ ఉక్కు ప్రవేట్ పరంగాకుండా కాపాడాలని డిమాండ్ చేశారు. సిపిఐ మండల కార్యదర్శి చలపతి, కార్యదర్శులు గంగులప్పా, రమణ ,అంజినప్ప, నారాయణ ,నరసింహ నాయక్, కళావతి, శాంతమ్మ తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin