సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : రంగారెడ్డి జిల్లా పరిషత్ కార్యాలయంలో స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ స్టాండింగ్ కమిటీ సమావేశం స్థాయి సంఘం చైర్పర్సన్, కేశంపేట మండల జడ్పీటీసీ తాండ్ర విశాల శ్రవణ్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతు స్త్రీ, మరియు శిశు సంక్షేమ శాఖ వారి కార్యక్రమాలపై మరియు దుర్గాబాయి మహిళ శిశు వికాస కేంద్రం వారి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించడం జరిగిందన్నారు. అంగన్వాడీ కేంద్రాల యొక్క సేవలు అమోఘమని వారు చేస్తున్న సేవలు గర్భిణీ స్త్రీలకు, చిన్నారులకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని కొనియాడారు. ఈ స్థాయి సంఘం సమావేశంలో జడ్పీ డిప్యూటీ సీఈఓ రంగా రావు, డిడబ్లుఓ పద్మజ, మంచాల్ జడ్పీటీసీ నిత్య నిరంజన్ రెడ్డి, జిల్లా సిడిపిఓ అధికారులు, స్త్రీ శిశు సంక్షేమ మరియు దుర్గాబాయి మహిళ శిశు వికాస కేంద్రం అధికారులు పాల్గొన్నారు.
-----------------------
Admin