సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీలో ఆశాలు మధ్యాహ్న భోజన కార్మికులు ఐకెపి సిబ్బంది వివోఏలు అన్ని విభాగాల్లో పని చేస్తున్న స్కీం వర్కర్లు కొత్తగూడెం సీఐటీయూ కార్యాలయం నుంచి బస్టాండ్ మీదుగా కలెక్టర్ ఆఫీస్ వద్దకు ర్యాలీగా వెళ్లి అక్కడ ధర్నా నిర్వహించి కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ధర్నా అనంతరం సిఐటియు పట్టణ కార్యదర్శి డి వీరన్న అధ్యక్షతన జరిగిన ఈ సభలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షురాలు అంగన్వాడి వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి జిలకర పద్మ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా అంగన్వాడి ఆశ మధ్యాహ్నం భోజన కార్మికులు వివోఏ ఐకెపి తదితర రంగాలలో పనిచేస్తున్నటువంటి స్కీం వర్కర్లు కోటి మంది ఉన్నారని అదే తెలంగాణలో మూడున్నర లక్షల మంది స్కీం వర్కర్లు పనిచేస్తున్నారని వీరు దిగువన ఉన్నటువంటి పేద గిరిజన అలాగే దళితుల అభ్యున్నతి కోసం ఈ స్కీములు స్కీం వర్కర్లు పనిచేస్తున్నారని అలాంటి స్కీములకు బడ్జెట్లో నిధులు కేటాయించకుండా ఆ స్కీములను ప్రైవేటు పరం చేస్తూ ఆ స్కీములలో పనిచేస్తున్నటువంటి స్కీం వర్కర్లకు కనీస వేతనాలు ఇవ్వకుండా, తద్వారా మెల్లమెల్లగా ప్రభుత్వం తమ బాధ్యత నుంచి తప్పుకోవాలని చూస్తుందని ఆమె విమర్శించారు స్కీం వర్కర్ల కనీస వేతనాలు 26 వేల రూపాయలు ఇవ్వాలని ఆల్ ఇండియా లేబర్ కౌన్సిల్ 45 ప్రకారం స్కీం వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించాలని ఉద్యోగ భద్రత కల్పించి ఈఎస్ఐపిఎఫ్ సౌకర్యాలు కల్పించాలని గత 40 సంవత్సరాలుగా పనిచేస్తున్న స్కీములను సీఎం వర్కర్లను రిటైర్మెంట్ బెనిఫిట్ సౌకర్యం కల్పించి వారికి గౌరవ వేతనం స్థానంలో కనీస వేతనం అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సి.ఐ.టి.యు జిల్లా నాయకులు భూక్య రమేష్, కే సత్య రమణ, కళావతి, మాధవి, హేమలత, సుక్కమ్మ, రాజ్యలక్ష్మి, మధ్యాహ్న భోజన కార్మికుల రమాదేవి, మాలాన్ బి, ఆశ వర్కర్ నాయకురాలు రమాదేవి, లలిత తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin