సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : పాల్వంచ దమ్మపేట సెంటర్ నుండి కుంటి నాగుల గూడెం వరకు రోడ్డుకు మరమ్మతు ఎప్పుడో అని ఎదురుచూస్తున్న బాటసారిలు. పాల్వంచ పట్టణ పరిధిలో... దమ్మపేట సెంటర్ నుండి కుంటి నాగుల గూడెం వరకు చినుకు పడితే చిత్తడిగా... రోడ్లు తిరగలేని పరిస్థితి ఏర్పడుతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు దారుణంగా గుంతల మయం అయిందని దీనివల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరించారని ఈ రోడ్డు నిర్దర్శనం. కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా నాణ్యతలేని మెటీరియల్ ఉపయోగించి, నాసిరకంగా రోడ్లను నిర్మించారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు నాణ్యత ప్రమాణాలను చూశారా..! అని సందేహం వెళ్ళబుచుతున్నారు స్థానికులు. ఈ గుంతలు, వాహనదారులకు శాపంగా మారాయా...! రాత్రి పూట గుంతలో పడి యాక్సిడెంట్లో గాయాలపాలై, ఎవరికి ఏమవుతుందో అని భయమేస్తుంది స్థానికుల ఆవేదన. పగలు రాత్రి అని తేడా లేకుండా,వాహనదారులు భయాందోళన చెందుతున్నారని అన్నారు. ఇప్పటికైనా పై అధికారులు వెంటనే స్పందించి. పాల్వంచ దమ్మపేట సెంటర్ నుండి కుంటి నాగుల గూడెం వరకు రోడ్డు మరమ్మత్తులను చేపట్టేలా చర్యలు తీసుకోవాలని..... కోట్ల రూపాయల నిధులతో నాసిరకం రోడ్లను నిర్మించడానికి సహకరించిన అధికారులు, కాంట్రాక్టర్లపై కటిన చర్యలు తీసుకోవాలని స్థానికులు, స్వచ్ఛంద సంస్థలు కోరుతున్నారు.
-----------------------
Admin