సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : రుద్రంపూర్ ఉద్యమ స్ఫూర్తి ప్రాంగణంలో తెలంగాణ ఉద్యమకారుడు రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్, ప్రముఖ గాయకుడు సాయిచంద్ మృతి పట్ల రుద్రంపూర్ లో గూడెల్లి యాకయ్య జేఏసీ ఆధ్వర్యంలో సంతాపం తెలిపారు. తెలంగాణ ఒక గొప్ప కళాకారుడిని కోల్పోయిందన్నారు. ఉద్యమ సమయాన సాయిచంద్ అన్న రుద్రంపూర్ విచ్చేసి రుద్రంపూర్ జేఏసీతో ధూమ్ దాం నిర్వహించడం రుద్రంపూర్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో పునర్నిర్మాణంలో సాయి చంద్ ఎంతో కీలకమన్నారు. సాయిచంద్ ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని భగవంతున్ని ప్రార్థించారు ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు పురుషోత్తం గారు, టీబీజీకేఎస్ వైస్ ప్రెసిడెంట్ రజాక్, ఏఐటియుసి బ్రాంచ్ సెక్రెటరీ వీరస్వామి, తెలంగాణ క్రాంతి, ఐలన్న, యూసుఫ్, దేవ్ సింగ్, అనిల్, మునవర్, కొంకటి కృష్ణ, బావు సతీష్, రాజేంద్రప్రసాద్, జలీల్, ఉమర్, సురేష్, శ్రీకాంత్, లోకేష్, వంశీ, కుమార్ స్వామి, కౌశిక్ టెంట్ హౌస్, శేఖర్, వెంకటస్వామి ఐఎన్టియుసి తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin