సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : కొత్తగూడెం మండల కేంద్రం, బూర్క గుంపు కు చెందిన మల్లెల నరసయ్య.గత నెల రోజులుగా యూరియా కోసం తిరిగి తిరిగి ఒక్క బస్తా కూడా దొరకక విసిగి పోయిన రైతు, పంట తన కళ్ళముందుటనే నష్టపోతుంటే చూడలేక ఆత్మహత్యాయత్నం చేసుకున్న రైతును ఈరోజు నర్సంపేట ప్రభుత్వ మెడికల్ కళాశాలలో పరామర్శించి ధైర్యాన్ని చెప్పిన మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి.ఈ సందర్భంగా మాట్లాడుతూ.రైతులు ఎవరు ఆధైర్య పడొద్దు ధైర్యంగా నిలబడి ప్రభుత్వంతో కొట్లాడి పంటలను కాపాడుకోవాలి.రైతులు తమ పంటలను కోల్పోయి అధైర్యపడి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి రావడానికి ప్రధాన కారణం ప్రభుత్వం అసమర్ధతే.స్థానిక మంత్రి సీతక్క.తన నియోజకవర్గ రైతులను కాపాడుకునే స్థితిలో లేకపోవడం దురదృష్టకరంఇప్పటికైనా రైతులకు అదనంగా యూరియా అందించి పంటలను, రైతులను కాపాడుకోవాలని మంత్రి సీతక్క విజ్ఞప్తి చేస్తున్నాను.రైతుల ఈ దుస్థితికి కారణమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మలనాగేశ్వరరావు ,స్థానిక మంత్రి సీతక్క.వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాను ఈ కార్యక్రమంలో ఓడీసీఎంఎస్ చైర్మన్ రామస్వామి నాయక్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్ గౌడ్, పట్టణ అధ్యక్షుడు నాగేల్ వెంకటనారాయణ గౌడ్, కొత్తగూడెం మండల పార్టీ అధ్యక్షుడు వేణు, పట్టణ పార్టీ ప్రధాన కార్యదర్శి వేనుముద్దుల శ్రీధర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ దేవోజు సదానందం, వార్డ్ అధ్యక్షులు ఇతర మండల పార్టీ నాయకులు క్లస్టర్ బాధ్యతలు పాల్గొన్నారు
-----------------------
Admin