సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : టిఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే పేద ప్రజల భూములను లాక్కుంటారని... షాద్ నగర్ నియోజకవర్గంలోని సిద్దాపూర్ గ్రామంలో అదే జరిగిందని పేద ప్రజల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వీర్లపల్లి శంకర్ కోరారు. బుధవారం కొందుర్గు మండల పార్టీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో మండలంలోనీ ముట్పూర్, బైరంపల్లి, మహదేవ్పూర్, రామచంద్రపూర్, పులుసు మామిడి, పర్వతాపూర్, గ్రామాలలో ఆరు గ్యారెంటీ ల పథకాలను ఇంటింటికీ వివరిస్తూ ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సంధర్బంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. పేద ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ వారికి భూములను కేటాయిస్తే టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని లాక్కుంటుందని విమర్శించారు. ప్రజల జీవన విధానం సుఖంగా సంతోషంగా ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారం కి రావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి, మాజీ జడ్పిటిసి శ్యాంసుందర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు కృష్ణారెడ్డి, కుసుమామిడి సర్పంచ్ సలీం, పర్వతాపూర్ ఎంపిటిసి మంజుల మల్లేష్ గౌడ్, నర్సింలు, సీనియర్ నాయకులు పురుషోత్తం రెడ్డి, జితేందర్ రెడ్డి తో పాటుగా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
-----------------------
Admin