సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : యావత్ భారతదేశం సిగ్గుతో తల దించుకునే విధంగా మతోన్మాద శక్తులు చురకత్తులు జలిపిస్తున్నాయని, మానవత్వాన్ని మంటగల్పుతున్నాయని, మణిపూర్ సంఘటనతో కేంద్ర బిజెపి పాలనకు గోరి కడతామంటూ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్ హెచ్చరించారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణ చౌరస్తాలో భారత ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. మణిపూర్ ముఖ్యమంత్రి డౌన్ డౌన్ అంటూ బిజెపి దుర్మార్గపు పాలన అని నినందించారు. మణిపూర్ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు నాగమణి ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళన కార్యక్రమానికి కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ.. భారతీయ జనతా పార్టీ పాలనలో దుర్మార్గం చోటు చేసుకుంటుందని అన్నారు. మతోన్మాద శక్తులు పెట్రేగిపోతున్నాయని అన్నారు. ఉత్తర ప్రదేశ్ మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో మతోన్మాద శక్తులు విచ్ఛిన్నకర శక్తులు పెట్రేగీపోతున్నాయని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళా కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
-----------------------
Admin