సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : ప్రజాపాలన కార్యక్రమానికి జిల్లాలో మంచి స్పందన వస్తుందని రెండో రోజు ప్రజల నుండి 35109 దరఖాస్తులు స్వీకరించామని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావ్ తెలిపారు. శుక్రవారం రెండో రోజు జిల్లాలోని 85 గ్రామ పంచాయతీలలో 27695 అలాగే 21మున్సిపాలిటీ వార్డులలో 7414 ప్రజల నుండి మొత్తం 35109 దరఖాస్తులు స్వీకరించామని కలెక్టర్ తెలిపారు. ప్రతి చోట వచ్చే ప్రజలకు మౌలిక వసతులు కల్పించాలని అలాగే కౌంటర్ల వద్ద పారదర్శకతతో ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించి రసీదులు తప్పక అందించాలని సూచించారు. ప్రజలకు అభయ హస్తం దరఖాస్తు పూరింపులో హెల్ప్ డెస్క్ సిబ్బంది సహకారం అందించాలని సూచించారు. ప్రతి నియోజక వర్గాల ప్రత్యేక అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని నిర్దేశించిన విదంగా జనవరి 6 వరకు సిబ్బంది విధులు నిర్వహించాలని నియోజక ప్రత్యేక అధికారులు నిరంతర పర్యవేక్షణ ఉంచాలని ఈ సందర్బంగా సూచించారు..
-----------------------
Admin