సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మఠంపల్లి : గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో హుజూర్ నగర్ మండలంలోని అమరవరం, అంజలిపురం మఠంపల్లి మండలంలోని యాతవాకిళ్ళ,అల్లిపురం బక్కమాంతుల గూడెం, దొనబండ తండా, పాత తండా ,చౌటపల్లి ,మఠంపల్లి మొదలు గ్రామాలకు నాగార్జునసాగర్ ప్రాజెక్టు ద్వారా సాగునీరు ఈ చివరి భూములకు అందకపోవడం వలన ఆనాడు మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి రైతుల కష్టాలను తీర్చడం కొరకు సుమారు 50 కోట్లు ఖర్చుపెట్టి కృష్ణ నది వద్ద అమరవరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఏర్పాటు చేశారు.తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ లిఫ్టును నడిపించడంలో పూర్తిగా విఫలమయ్యారు గత సంవత్సరం నాగార్జునసాగర్ ప్రాజెక్టు కాలువ తెగిపోయినప్పుడు సుమారు రెండు నెలలు సాగునీరు అందకపోవడం వలన అప్పుడు పొలాలు ఎండిపోయాయి అటువంటి సమయంలో ఈ లిఫ్టు నడిచినట్లైతే రైతులు నష్టపోకపోయి ఉండేవారు ఈరోజు సాగర్ వాటర్ రాకపోవడం వల్ల లిఫ్ట్ ఇరిగేషన్ పనిచేయకపోవడం వల్ల రైతులు చాలా నష్టపోతున్నారు కనీసం వర్షాధారంగా సాగుచేసిన పంట పొలాలను కాపాడటంలో కూడా ప్రభుత్వ ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రతినిధులు సరైన దృష్టి పెట్టకపోవడం వల్ల వారి నిర్లక్ష్యం వలన ఈరోజు లిఫ్టు నడవక పొలాలు ఎండిపోయి గత్యంతరం లేని పరిస్థితి దాపురించింది కనీసం ఎప్పటిలోగా రిపేర్ అవుతుంది ఎప్పటినుండి రైతులకు సాగునీరు అందించగలుగుతారు అనేది ఎటువంటి క్లారిటీ రైతులకు ఇవ్వడం లేదు కాబట్టి రైతులందరూ కూడా అయోమయ పరిస్థితిలో ఉన్నారు కాబట్టి తక్షణమే ప్రభుత్వం చెప్పిన విధంగా లిఫ్ట్ నిర్వహణను ప్రభుత్వాలు నిర్వహిస్తాయని గతంలో ముఖ్యమంత్రి ప్రకటించిన విధంగా తక్షణమే మరమ్మతులు చేయించేసి సాగు చేసిన పంట పొలాలను కాపాడాలని తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు దొండపాటి ఆదిరెడ్డి కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర వైస్ చైర్మన్ మరియు ఎండి నిజాముద్దీన్ మైనారిటీ సెల్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మరియు కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బచ్చు అశోక్ మరియు అల్లిపురం మాజీ సర్పంచ్ భోగాల పిచ్చిరెడ్డి , అమరవరం కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు కర్నాటి వీరనాగిరెడ్డి, ఎక్స్ ఎంపీటీసీ కిసాన్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు సింగతల వెంకటరెడ్డి పిఎసిఎస్ వైస్ చైర్మన్ అమరవరం పుస్తెల శ్రీనివాస్ రెడ్డి మఠంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు గంగసాని ఎల్లారెడ్డి గారు తదితర రైతులు వెంకట నర్సిరెడ్డి పాల్గొన్నారు
-----------------------
Admin