సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : పహల్గాం ఉగ్రదాడికి కేంద్రం బాధ్యత వహించాలి - దోషులను కఠినంగా శిక్షించాలి - మైనారిటీ జిల్లా అధ్యక్షులు ఎండీ.యాకూబ్ పాషా కొత్తగూడెం: జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాం సమీపంలో యాత్రికులపై ఉగ్రవాదులు చేసిన దాడిలో చనిపోయిన కుటుంబాలకు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ, ఈ దాడులకు పాల్పడిన దోషులను ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనార్టీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎండీ. యాకూబ్ పాషా గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఇంటెలిజెన్స్ విభాగాల నిర్లక్ష్యం కారణంగానే గతంలో పుల్వామా నేడు పహల్గాం దాడులు జరిగాయన్నారు. ఈ దాడులకు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలన్నారు. ఈ ఘటనలో మరణించిన 26 మందిలో హిందూ-ముస్లింలతో పాటు అన్ని కులాల వారు ఉన్నారని, బీజేపీ అధికార సోషల్ మీడియా మాత్రం ముస్లింలను టార్గెట్ చేస్తూ హింసని ప్రేరేపించేలా పోస్టులను పెడుతూ, ముస్లింల మీద ధ్వేషాన్ని రెచ్చగొట్టేలా హిందువులనే లక్ష్యం చేసుకొని ఈ దాడులు జరిగాయని అనడం బాధకరమని అన్నారు. ఈ దాడులు ఉగ్రవాదులు హిందూ -ముస్లిం అనే బేధ భావం లేకుండా కాల్పులు జరిపారని చెప్పారు. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పోరాడి సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా అనే ముస్లిం ప్రాణాలను కోల్పోయాడనే విషయాన్ని గుర్తు చేశారు. ఈ దాడులను యావత్ భారత సమాజం తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు.
-----------------------
Reporter