సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : మణిపూర్ లో జరుగుతున్న హింసకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ అన్నారు.సోమవారం పార్టీ కార్యాలయంలో జరిగిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మణిపూర్ లో గత తొంభై రోజులుగా అడ్డు అదుపు లేకుండా జాతుల హింస పరాకాష్టకు చేరిందని ఆందోళన వ్యక్తం చేశారు.అందులో భాగంగా గిరిజన మహిళలను నగ్నంగా ఊరేగించి వారిపై లైంగిక దాడికి పాల్పడి దారుణంగా హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించడంతో పాటు ఆరాష్ట్రంలో చెలరేగుతున్న హింసను నివారించి శాంతియుత,సాధారణ పరిస్థితులు నెలకొనేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.మణిపూర్ లో పరిస్థితిని అదుపుచేయడంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు.దేశ వ్యాప్తంగా తీవ్ర ఆందోళన రేకెత్తిస్తున్న ఈ సమస్యను పరిష్కరించడానికి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని,ఈ కిరాతక,ఆనాగరికతక చర్యలకు బీజేపీ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.నాగాలకు,కుకీ గిరిజనులకు రక్షణ కల్పించాలని కోరారు.మణిపూర్ ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని,అల్లర్ల భాదితులకు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు ఈకార్యక్రమంలో జిల్లా సలహాదారు గంధం మల్లికార్జున్ రావు,సాయి,మాలోత్ వీరు నాయక్,ప్రసాద్,తాడురి అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin