సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మఠంపల్లి మండలంలోని గుర్రంపోడు తండా నాగార్జునసాగర్ భూ నిర్వాసితుల సమస్య పూర్తిగా తెలిసిన వ్యక్తిగా ,ఆరోజు భూ పరిరక్షణ సమితి తీసుకున్న ఉద్యమానికి పూర్తిగా మద్దతునిస్తూ ,స్థానిక ప్రాంతాన్ని సందర్శించి ,స్వతహాగా రైతులతో మాట్లాడి ,తప్పకుండా రాబోయే కాలంలో మీ సమస్యని ,తీరుస్తానని మాట ఇచ్చిన ,కోదండరాం ప్రస్తుత ప్రభుత్వంలో ,ఎమ్మెల్సీగా నియమితులైన సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ తమ ఆఫీసులో గుర్రంపోడు భూ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో*అధ్యక్షులు ఇస్లావత్ బాలాజీ నాయక్ ,ఉన్నత న్యాయస్థానం హైకోర్టు అడ్వకేట్ ,పౌర హక్కుల ప్రజా సంఘం ,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ,జయ వింధ్యాల ,సామాజిక ఉద్యమకారులు హరిత్ కలిసి ఆరోజు గుర్రంపోడు రైతుల బాధలు తెలిసిన వ్యక్తిగా ,స్వతహాగా తమ మద్దతు తెలుపుతూ ,గుర్రంపోడు ఉద్యమాన్ని నైతికంగా ,సపోర్టు చేసిన వ్యక్తిగా కోదండరాం ఉన్నారు .కావున ఆ ప్రాంత సమస్యలు తెలిసిన వ్యక్తిగా ప్రభుత్వంతో మాట్లాడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని , ఎంక్వయిరీ చేపించి ,బాధితులకు న్యాయం చేసి అక్రమార్కులను గుర్తించి ,చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ,అప్పుడే ప్రజా ప్రభుత్వంలో ,ప్రజలకు న్యాయం జరుగుతుందని అనుకుంటామని ,బాలాజీ నాయక్ అన్నారు .కోదండరాం మాట్లాడుతూ తప్పకుండా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి బాధితులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు....
-----------------------
Admin