సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ లో ఆధార్ ,ఆధార్ అప్డేట్ కోసం పిల్లలు,పెద్దలు పడరాని ఇబ్బందులు పడుతున్నారు..తెల్లవారు జామున నాలుగు గంటల నుండి క్యూ లైన్ కట్టారు..హుజూర్ నగర్ పట్టణం లో 3 ఆధార్ కేంద్రాలు ఉన్నాయి .1) పోస్ట్ ఆఫీస్ 2) నాగార్జున గ్రామీణ బ్యాంకు, 3,) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ మూడు సెంటర్ ల లో రోజుకు ఒక్కొక్క సెంటర్ లో 30 మందికి మాత్రమే కుదించడం తో ప్రజలు నరకయాతన పడుతున్నారు..రేషన్ దుకాణాల్లో వేలు ముద్రలు పడక పోవడం,కొంత మంది కి ఆధార్ అప్డేట్ కాకపోవడం స్కూల్ లల్లో ఆధార్ అడగడం దీనితో అనేక మంది ఆధార్ సెంటర్ ల చుట్టూ ప్రదక్షిణ లు చేయవల్సిన పరిస్థితి ఏర్పడింది..డిజిటల్ ఇండియా సంగతి దేవుడెరుగు కానీ పెద్దలు పిల్లలు ఆధార్ కోసం ఇలా క్యూ లైన్ లో నిలబడటం చివరకు ఆ రోజు సీరియల్ వస్తాదో రాదో అనే బాధ లు ఉండటం తో ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆధార్ అప్డేట్ కు 30 రూపాయలు తీసుకోవాల్సి ఉండగా అధిక మొత్తంలో మూడు రెట్లు వసూలు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికైన ఉన్నతాధికారులు మరిన్ని ఆధార్ సెంటర్ లు ఏర్పాటు చేయాలని అదే విధంగా కనీసం రోజుకు ఒక్కొక్క సెంటర్ లో 100 కి పైగా చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
-----------------------
Admin