సర్కార్ టీవీ న్యూస్ / హైద్రాబాద్ : రాష్ట్రంలో 2019 తర్వాత ఎన్రోల్మెంట్ అయిన యువ న్యాయవాదులకు ఇప్పటికీ హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులు జారీ కాకపోవడం ఆందోళనకర అంశమని ఫెడరేషన్ ఆఫ్ లీగల్ ప్రొఫెషనల్స్ జాతీయ అధ్యక్షుడు తాళ్లూరి దిలీప్ చౌదరి అన్నారు. సెక్రటేరియట్ లో న్యాయశాఖ కార్యదర్శి రెండ్ల తిరుపతికి ఆయన మంగళవారం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2019 తర్వాత న్యాయవాదులుగా చేరిన వారు గత ఏడు సంవత్సరాలుగా హెల్త్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారని, వెంటనే వారికి కార్డులు జారీ చేయాలని కోరారు. ఢిల్లీ ప్రభుత్వం ఆద్వర్యంలో నడుస్తున్న "అడ్వకేట్స్ వెల్ఫేర్ స్కీమ్" మాదిరిగా తెలంగాణలో కూడా మెడిక్లెయిమ్ మరియు టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ను అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ మోడల్లో 5 లక్షల మెడికల్ ఇన్సూరెన్స్తోపాటు, న్యాయవాది మృతిచెందిన సందర్భంలో వారి నామినీకి 10 లక్షల రూపాయల టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ కల్పిస్తున్నారని తెలిపారు. హెల్త్ ఇండియా ఇన్సూరెన్స్ TPA సర్వీసెస్ సంస్థను సంప్రదించి తెలంగాణ అడ్వకేట్స్ వెల్ఫేర్ ట్రస్ట్ కూడా ఇలాంటి పథకాన్ని స్వీకరించాలని సూచించారు. అనంతరం హోం సెక్రటరీతోనూ భేటీ అయిన దిలీప్, 35 BNSS నోటీసు కి సవరణలు, 7 సంవత్సరాలనుండి 3 సంవత్సరాల లోపు నేరాలకు కుదించాలని, 3 నుంచి 7 ఏళ్ల non bailable కేసెస్ కి 35(3) రిమాండ్ తప్పని సరి చెసి బాధితులకి న్యాయం చేసే విధం గా సవరించాలని కోరారు. 197వ న్యాయ సంఘం నివేదిక ప్రకారం 50% టెన్యూర్ పీపీ పోస్ట్స్ కి నియామకాల్లో మార్పులు చేపట్టాలని కోరారు. న్యాయ శాఖ కార్యదర్శి ఈ వినతిపత్రాన్ని సానుకూలంగా స్పందించారని దిలీప్ చౌదరి ప్రకటనలో తెలిపారు...
-----------------------
Admin