సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : కాంగ్రెస్, బిజెపిలను నమ్మితే మోసపోతాం అని కేశంపేట ఎంపీపీ రవీందర్ యాదవ్ పేర్కొన్నారు. షాద్ నగర్ నియోజకవర్గం కొత్తూరు మండలంలోని పెంజర్ల లో జడ్పిటిసి ఎమ్మె శ్రీలత సత్యనారాయణ ఆధ్వర్యంలో వివిధ పార్టీల నుండి బిఆర్ఎస్ పార్టీలోకి పలువురు చేరారు.వారికి కండువా కప్పి సాదరంగా పార్టీలోకి కేశంపేట్ ఎంపీపీ రవీందర్ యాదవ్ ఆహ్వానించారు. పార్టీలో చేరిన చెక్కల మహేందర్ ముదిరాజ్, శేఖర్, దేశాల శివకుమార్, పలుగుట్ట శ్రీను, గూడెపు రాజు, దేశాల విజయ్, రామట్ల కార్తీక్, ఈర్లపల్లి రవిచంద్ర, వేణు, బ్యాగరీ రవి, ప్రవీణ్ కుమార్, రజినీకాంత్, ధరణిశ్వర్ లకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బిఆర్ఎస్ తోనే అందరికీ న్యాయం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వనం బాలరాజ్, గ్రామ కమిటీ అధ్యక్షుడు చెక్కల సత్తయ్య, బిఆర్ఎస్ పార్టీ మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు దేశాల జైపాల్, బిఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు మామిడి దామోదర్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ దేశాల భీమయ్య, బ్యాగరీ రాజు, పలుగుట్ట పెద్ద మల్లయ్య, గ్రామ కమిటీ ఉపాధ్యక్షుడు సహదేవ్, రామట్ల రాములు, షేక్ నూరుద్దీన్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు భారీగా పాల్గొన్నారు.
-----------------------
Admin