సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ పట్టణంలో ని శ్రీ వేణుగోపాల సీతారామచంద్ర స్వామి వారి దేవాలయంలో శనివారం ముక్కోటి ఏకాదశి భక్తజన సందోహంగా జరిగింది. తెల్లవారుజాము నుండి భక్తులు స్వామివారిని ఉత్తర ద్వారo దర్శనం ద్వారా చేసుకోవడానికి క్యూ లైన్ లలో వేచి చూశారు. ఈ దేవాలయం పురాతన కాలం నుండి ఉత్తర దిశ వైపే రాజుల కాలంలో నిర్మించబడింది. కాబట్టి సంవత్సరం అంతా కూడా ఉత్తర ద్వారం ద్వారానే స్వామిని దర్శనం చేసుకునే అవకాశం వుంది.ప్రాతః కాల పూజాంతరం సీతా లక్ష్మణ సమేత రామచంద్ర స్వామి వారిని పెద్ద గరుడ వాహనంపై వేంచేసి భక్తుల జయ జయ ద్వానాలు, జై శ్రీమన్నారాయణ జైజైలతో ఉత్తర ద్వారం వైపు వైపుకు కదిలారు. అనంతరం ఉత్తర ద్వారంలో స్వామి నుంచి పూజలు చేశారు. ఉత్తర ద్వారాన్ని ముక్కోటి సందర్భంగా రంగురంగుల పూలతో అలంకరించి మామిడి తోరణాలు కట్టారు. ధూపదీప నైవేద్యాల తదనంతరం స్వామిని ద్వారo తెరిచి భక్తులకు దర్శనం ఇచ్చారు. తన్వయత్వంతో భక్తులు స్వామిని దర్శించుకున్నారు. దేవాలయంలో మౌలిక వసతులను ఆలయ జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాసరావు పర్యవేక్షించారు.ఇట్టి కార్యక్రమంలో మహిళలు తెచ్చిన హారతులతో దేవాలయ ప్రాంగణం దేదీప్యమానమైంది. ఇట్టి కార్యక్రమంలో అర్చకులు రాఘవాచార్యులు, నరసింహచార్యులు, స్థానాచార్యులు ఎం. శ్రీనివాసచార్యులు భక్తులు,పుర ప్రముఖులు మహిళలు విశేషంగా పాల్గొన్నారు..
-----------------------
Admin