Friday, 08 May 2026 09:22:09 PM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

హుజూర్ నగర్ లో వైభవంగా ముక్కోటి ఏకాదశి...

Date : 23 December 2023 11:49 PM Views : 248

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ పట్టణంలో ని శ్రీ వేణుగోపాల సీతారామచంద్ర స్వామి వారి దేవాలయంలో శనివారం ముక్కోటి ఏకాదశి భక్తజన సందోహంగా జరిగింది. తెల్లవారుజాము నుండి భక్తులు స్వామివారిని ఉత్తర ద్వారo దర్శనం ద్వారా చేసుకోవడానికి క్యూ లైన్ లలో వేచి చూశారు. ఈ దేవాలయం పురాతన కాలం నుండి ఉత్తర దిశ వైపే రాజుల కాలంలో నిర్మించబడింది. కాబట్టి సంవత్సరం అంతా కూడా ఉత్తర ద్వారం ద్వారానే స్వామిని దర్శనం చేసుకునే అవకాశం వుంది.ప్రాతః కాల పూజాంతరం సీతా లక్ష్మణ సమేత రామచంద్ర స్వామి వారిని పెద్ద గరుడ వాహనంపై వేంచేసి భక్తుల జయ జయ ద్వానాలు, జై శ్రీమన్నారాయణ జైజైలతో ఉత్తర ద్వారం వైపు వైపుకు కదిలారు. అనంతరం ఉత్తర ద్వారంలో స్వామి నుంచి పూజలు చేశారు. ఉత్తర ద్వారాన్ని ముక్కోటి సందర్భంగా రంగురంగుల పూలతో అలంకరించి మామిడి తోరణాలు కట్టారు. ధూపదీప నైవేద్యాల తదనంతరం స్వామిని ద్వారo తెరిచి భక్తులకు దర్శనం ఇచ్చారు. తన్వయత్వంతో భక్తులు స్వామిని దర్శించుకున్నారు. దేవాలయంలో మౌలిక వసతులను ఆలయ జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాసరావు పర్యవేక్షించారు.ఇట్టి కార్యక్రమంలో మహిళలు తెచ్చిన హారతులతో దేవాలయ ప్రాంగణం దేదీప్యమానమైంది. ఇట్టి కార్యక్రమంలో అర్చకులు రాఘవాచార్యులు, నరసింహచార్యులు, స్థానాచార్యులు ఎం. శ్రీనివాసచార్యులు భక్తులు,పుర ప్రముఖులు మహిళలు విశేషంగా పాల్గొన్నారు..

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :