సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : బాల్కొండ మండల కేంద్రంలో అయ్యప్ప స్వాములు, విశ్వహిందూ పరిషత్ సభ్యులు రాస్తారోకో నిర్వహించారు. బైరి నరేష్ అనే హేతువాది హిందుత్వంపై అయ్యప్ప స్వాముల పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను వన్నెల్ బి చౌరస్తా వద్ద స్వాములు బైఠాయించారు. బైరి నరేష్ ను తక్షణం అరెస్టు చేయాలని లేదంటే పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తామని స్థానిక గురుస్వామి తెలిపారు. ఇట్టి వివాదాస్పద వ్యాఖ్యలను వెనక తీసుకుని అయ్యప్ప స్వాములు క్షమాపణ కోరాలని గురుస్వాములు డిమాండ్ చేశారు. అయ్యప్ప స్వామి కారణజన్ముడని తెలియకుండా ఏదో మాట్లాడితే నాలుకలు కోస్తామని గురుస్వామి హెచ్చరించారు. మర్యాదగా క్షమాపణ చెప్పకపోతే రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు చేస్తామన్నారు. అనంతరం ర్యాలీగా వెళ్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు మరియు, విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు పాల్గొన్నారు...
-----------------------
Admin