సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం పట్టణంలోని సింగరేణి ఉమెన్స్ కాలేజ్ లో ఈరోజు GSR ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళ శక్తి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా GSR ట్రస్ట్ చైర్మన్ రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ డాక్టర్ గడల శ్రీనివాసరావు విచ్చేశారు. ఎంతోమంది మహిళా అధికారులను ఆహ్వానించారు. ఈ ఆధునిక యుగంలో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని మహిళలకు తలుచుకుంటే చేయలేనిది లేదంటూ అలాగే మన రాష్ట్రపతి నుండి సాధారణమైన వృత్తి వరకు అన్ని రంగాలలో మహిళలు ముందంజలో ఉన్నారని అన్నారు. మహిళలు లేని మగవారి జీవితం లేదన్నారు తన జీవితంలో కూడా స్త్రీలు ఉన్నారని తన తల్లి ,సోదరి, తన భార్య వీరు లేనిది నేను లేను అని అన్నారు. ఉన్నత స్థాయి నుండి సాధారణ స్థాయి వరకు అందరికి ఉత్తమ మహిళా అవార్డులను అందించారు అలాగే వారిని సన్మానించారు. కొంతమంది మహిళలు మగవారికి ఎందులోనూ తీసిపోలేని విధంగా వృత్తిని చేస్తున్నారు. అందులో ముఖ్యమైనది ఒక ముస్లిం మహిళ ఆటో డ్రైవర్ ఆసియా, సుజాతనగర్ లో మెకానిక్ పనిచేస్తున్న మహిళ, మరియు కాటి కాపరి మహిళ, వీళ్ళందరూ చేసే వృత్తి చాలా స్ఫూర్తిదాయకం అన్నారు.
-----------------------
Admin