సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం రోజున దుగ్గొండి మండలం దేశాయిపల్లి గ్రామ సర్పంచ్ ఉత్తరేణి భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించడం జరిగింది. గ్రామ సభకు ముఖ్య అతిథిగా నూతన స్పెషల్ ఆఫీసర్ గా హాజరైన దుగ్గొండి మండలం తహసిల్దార్ సమ్మక్క హాజరు కాగా గ్రామ సర్పంచ్ ఉత్తరేణి భాగ్యలక్ష్మి మరియు ఉప సర్పంచ్ అసోల సురేష్,పాలకవర్గం సభ్యులు పుష్పగుచ్చం ఇచ్చి శాలువాతో సన్మానించడం జరిగింది.అదేవిధంగా గ్రామ పంచాయతీ కి నూతనంగా వచ్చినటువంటి గ్రామ కార్యదర్శి స్వప్న ను కూడా సన్మానించడం జరిగింది. ప్రజా పాలనలో ప్రజల నుండి వచ్చినటువంటి సమస్యలను వినడం మరియు వినతి పత్రాలను తీసుకోవడం జరిగింది.స్పెషల్ ఆఫీసర్స్ అన్నారు.ఈ సందర్భంగా ఉత్తరేణి భాగ్యలక్ష్మి మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా చూస్తానని పర్యావరణ పరిరక్షణ,మొక్కల పెంపకం గురించి మెరుగైన వైద్యం,విద్య ,నీటి వనరుల,సేవల గురించి మెరుగైన విద్యుత్ సేవలు,రోడ్లు,డ్రైనేజీ సమస్యలు పలు అభివృద్ధి కార్యక్రమాలకు గ్రామ ప్రజలు సహకరించాలని సహకరిస్తే గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని తెలియజేశారు.అనంతరం ప్రజా ప్రణాళికలో భాగంగా ప్రభుత్వ పథకాలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించడం జరిగింది.గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా తమ దృష్టికి తీసుకురావాలని ఉత్తరేణి భాగ్యలక్ష్మి విన్న వించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నూతనంగా వచ్చినటువంటి తహసిల్దార్ కి గ్రామంలో సంబంధించినటువంటి సమస్యలను తాసిల్దార్ సమ్మక్క కు వివరించడం జరిగింది.తహసిల్దార్ సమ్మక్క మాట్లాడుతూ గ్రామంలో ఎలాంటి ఆవంచనియాలు జరగకుండా గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని గ్రామ సర్పంచ్ కి మరియు ఉప సర్పంచ్,గ్రామ ప్రజలు గ్రామ పాలకవర్గ సభ్యులకు అదేవిధంగా గ్రామపంచాయతీ కార్యదర్శి కి చెప్పడం జరిగింది.ఈ కార్యక్రమంలో కార్యదర్శి స్వప్న,ఉపసర్పంచ్ అసోలా సురేష్,స్పెషల్ ఆఫీసర్స్,లైన్మెన్ రాజు,ఫీల్డ్ అసిస్టెంట్ రవి, సిఎ రజిత,పాలకవర్గం సభ్యులు,గ్రామపంచాయతీ సిబ్బంది, మహిళా సంఘాలు,ఆశా వర్కర్లు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Reporter