సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ / ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రారంభించి రాష్ట్రవ్యాప్తంగా యువసందేశ్ 'బస్సు యాత్ర' చేపట్టేందుకు భారత యువజన కాంగ్రెస్ (ఐవైసీ) నిర్ణయించిందని యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి అందే మోహన్ ప్రకటించారు. సోమవారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని "వీ" కన్వెన్షన్ హాల్లో యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి రాహుల్ గాంధీ పుట్టిన రోజు కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ఆయనకు తినిపించారు. అనంతరం శివసేన రెడ్డిని అందే మోహన్ సన్మానించారు. కర్ణాటకలో నిర్వహించిన విజయవంతమైన ప్రచారాలు మరియు ఈ సంవత్సరం ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఇదివరకే యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు యువసేన రెడ్డి ఆధ్వర్యంలో చర్చించడం జరిగిందని ఆందే మోహన్ అన్నారు. బీఆర్ఎస్ నేతృత్వంలోని రాష్ట్ర, బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ద్రోహం చేస్తున్నాయని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యంతో యువత కెరీర్ నాశనం అయిందన్నారు. దేశ భవిష్యత్తు రాహుల్ గాంధీ అని అన్నారు. యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా యువజన కాంగ్రెస్ కార్యదర్శి నరేందర్ యువజన కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ముబారక్ అలీ ఖాన్ చంద్రశేఖర్ గౌడ్ రాయికల్ శ్రీనివాస్ శ్రీనాథ్ చేగుర్ శివ రాణా ప్రతాప్ జనార్ధన్ రెడ్డి జాఫర్ హలీం రవి ఆశమోని నౌషద్ సాయి వంశీ అనిల్ సోలిపూర్ అందే శ్రీకాంత్ శివ ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin