సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : దుగ్గొండి మండలం శంభయపల్లి గ్రామంలో గురువారం మధ్యాహ్నం బలమైన గాలులు వీస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ చోటుచేసుకుని అసోలా సురేష్ కు చెందిన మొక్కజొన్న చేనులోకి మంటలు వ్యాపించడంతో సురేష్ రెండు ఎకరాల్లో పండించిన మొక్కజొన్న కంకులను చేనులో వేయగా ఎకరం 30 గుంటలు మొక్కజొన్న కంకులు కాలిపోయాయి సురేష్ కు సుమారు లక్ష యాభై వేలు నష్టం వాటిల్లింది. ప్రభుత్వం సాయం అందించి ఆదుకోవాలని బాధిత రైతు కోరుతున్నాడు.
-----------------------
Reporter