సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబులదేవర చెరువు మండల పరిధిలో తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే వెన్నెముక అని, వారికి తాను ఎల్లప్పుడూ అండగా నిలుస్తానని మాజీ మంత్రి పల్లె పేర్కొన్నారు.ఈ మేరకు గురువారం నాడు అయన ఒడిసి మండలంలో పలువురు టిడిపి కార్యకర్తల కుటుంబాలను పరామర్శించారు. ఓబులదేవర చెరువు మండలంలోని చెరువు వాండ్ల పల్లికి చెందిన టిడిపి సీనియర్ నాయకుడు చంద్ర అనారోగ్యంతో మరణించగా వారి భౌతిక కాయానికి పూలమాల వేసి నివాళి అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు.అనంతరం నారప్ప గారి పల్లిలో నిన్నటి రోజున కుక్కల దాడిలో 20 గొర్రెలు మరణించి, మరో 20 గొర్రెలు గాయపడగా వాటి కాపర్లను పరామర్శించి, వివరాలు తెలుసుకొని ఆర్ధిక సాయం అందించారు.అనంతరం వెంకటాపురం భోగంపల్లి గ్రామానికి చెందిన సుజాతమ్మ కిడ్నీ సమస్యతో మరణించిన విషయం తెలుసుకొని వారి కుటుంబాన్ని పరామర్శించి ఆర్ధిక సాయం అందించారునవాబు కోట గ్రామానికి చెందిన సాడగల వీరనారయణకు చెందిన పాలు ఇచ్చే ఆవు మృతి చెందడంతో వారిని పరామర్శించి ఆర్ధిక సాయం అందించారు.నల్లచెరువు పల్లికి చెందిన నారాయణ తల్లి మరణించిన విషయం తెలుసుకొని, వారి కుటుంబాన్ని పరామర్శించిన 11 రోజుల వైకుంఠ సమారాధన ఏర్పాటు నిమిత్తం ఆర్ధిక సాయం అందించారు
-----------------------
Admin