సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ నియోజకవర్గం పరిధిలోని లక్కవరం గ్రామంలో ఓజో ఫౌండేషన్ వ్యవస్థాపకులు పిల్లుట్ల రఘు సుడిగాలి పర్యటన చేసి నిరుపేద కుటుంబాలకి చెందిన పలు వ్యక్తులను పరామర్శించారు. ఉటుకురు ప్రశాంత్ అనారోగ్యంతో బాధపడుతుంటే రఘు తన వంతు గా 5,000 రూపాయలు ఆర్థిక సహాయం మరో కుటుంబానికి చెందిన ఊటుకురి మహేష్ బైక్ ఏక్సిడెంట్ అవడం తో ఇబ్బంది పడుతుంటే రఘు ద్వారా 5,000 రూపాయలు ఆర్థిక సహాయం మరో కుటుంబానికి చెందిన కాసరపు సోమమ్మ పక్షవాతం తో బాధపడుతుంటే పరామర్శించి 5,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది. రఘు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే గా పోటీ చేస్తున్న అని ఒక్క సారి అవకాశం ఇచ్చి చూడండి ప్రతి ఒక్కరి ఆరోగ్య బాధ్యత నాదే నని గవర్నమెంట్ హాస్పిటల్ లో మెరుగైన వైద్యం అందే విధంగా డాక్టర్స్ నీ పెడతాం అని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు లక్కవరం గ్రామ వాసులు పాల్గొన్నారు
-----------------------
Admin