సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : భారతీయ జనతా పార్టీ లక్ష్మీదేవి పల్లి మండలం మహిళా ఉన్ మోర్చా ఆధ్వర్యంలో బుధవారం రాఖి పౌర్ణమి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం బీజేపీ జిల్లా కార్యాలయం, లక్ష్మీదేపల్లి మండల పోలీస్ స్టేషన్, తాసిల్దార్ ఆఫీస్, ఎంపీడీవో ఆఫీస్, లక్ష్మీదేవి పల్లి ఉన్నత పాఠశాల లో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. సోదర సోదరీ భావనకు ప్రతీక ఈ రాఖీ పౌర్ణమి అని తెలిపారు. రక్షాబంధన్ కట్టిన సోదరుడు తనకు అన్ని విధాలుగా రక్షణగా ఉంటాడని సోదరి భావిస్తుందని తెలిపారు. భారతీయ సంస్కృతిలో రక్షాబంధన్ కు ప్రత్యేక ప్రాధాన్యత ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎడ్లపల్లి శ్రీనివాస్, కొత్తగూడెం పట్టణ అధ్యక్షులు లక్ష్మణ్ అగర్వాల్, లక్ష్మీదేవి పల్లి మండల ప్రధాన కార్యదర్శి మాలోత్ గాంధీ, మహిళా మోర్చా నాయకులు సమ్మక్క, వరలక్ష్మి, రమాదేవి, కవిత, తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin