సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : మహిళల విద్యా విషయం లో భారత వాసుల, చరిత్రకారులు ఎవరినైనా మరచిపోతే, అది ఫాతిమా బేగం షేక్. ఫాతిమా షేక్ తన సోదరుడు మియాన్ ఉస్మాన్ షేక్తో కలిసి పూణేలోని భిదేవాడి ప్రాంతంలో నివసించారు. జోతిబా పూలే పోరాడుతున్న కులతత్వo మరియు బ్రాహ్మణ వ్యతిరేక చర్యల కారణంగా జ్యోతిబా ఫులే తండ్రి అతనిని తన ఇంటి నుండి బహిష్కరించినప్పుడు, ఫాతిమా బేగం షేక్ అతనిని తన ఇంట్లో ఆశ్రయమిచ్చారు. ఫాతిమా షేక్ ఇంట్లోనే ఫులే దంపతులు మహిళల కోసం మొదటి పాఠశాలను ప్రారంభించారు, ఫాతిమా గ్రామాలకు వెళ్లి తమ కుమార్తెలకు విద్యను అందించడానికి అక్కడి ప్రజలను ప్రేరేపించారు. తరువాత, అదే పాఠశాలలో దళితులు కూడా బోధించబడ్డారు. సమాజంలోని పితృ వ్యవస్థపై పోరాటం. తల్లిదండ్రులు తమ కుమార్తెల విద్యను ప్రోత్సహించడానికి గంటల తరబడి సలహా ఇవ్వడం మరియు కులతత్వానికి వ్యతిరేకంగా కొత్త సమాజాన్ని స్థాపించే ప్రయత్నంలో ఫాతిమా షేక్ తన సంపూర్ణ సహకారాన్ని అందించారు. వర్ణ వ్యవస్థ, కుల అహంకారం అధికంగా ఉన్న ఆ నాటి సమాజo లో సాంఘిక సమానత్వం సాధన, స్త్రీ విద్య వ్యాప్తి కోసం సావిత్రి భాయి పూలే చేస్తున్న కార్యక్రమాలలో ఫాతిమా షేక్ తన సంపూర్ణ సహకారం అందించారు ఫాతిమా షేక్ విద్య కోసం ప్రజలను చైతన్యపరిచేందుకు వెళ్ళినప్పుడు, చాలా సార్లు ప్రజలు రాళ్ళు విసిరారు మరియు కొన్నిసార్లు పేడ విసిరివేయబడింది. ఫాతిమా షేక్ మొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా, మొదటి ముస్లిం ఉపాధ్యాయురాలిగా ఉన్నారు.ముస్లిం మహిళలకు మొదటి పాఠశాల 1848 లో ఫాతిమా షేక్ ప్రారంభించారు. భారత దేశం లో మొదటి బాలికల విద్యాలయమును 1848 లో పూనా నగరములో ఉస్మాన్ షేక్ నివాసం లో నెలకొల్పినది ఫాతిమా షేక్. ఫాతిమా షేక్ మరియు సావిత్రి భాయి ఫూలే తో పాటు సావిత్రి భాయి ఆడపడుచు సుగుణా భాయి కూడా బాలికా విద్యాలయములో బాలికలకు విద్య నేర్పేవారు. మియా షేక్ చెల్లెలు ఫాతిమా షేక్ 18వ శతాబ్దం లో ముస్లిమ్స్ లో మొదటి ఉపాద్యాయురాలు. ఆతరువాత సర్ సయ్యద్ 1875 లో ముస్లింల ఆధునికి విద్యకు మొదటి పునాది వేశారు. అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం స్థాపించారు. ముస్లిం మహిళలకు ఫాతిమా షేక్ యొక్క సహకారం సర్ సయ్యద్ విద్యా ప్రయత్నాల కన్నా తక్కువ గాదు. భారత దేశం కలకాలం గుర్తుoచుకోవలసిన వ్యక్తి స్త్రీ విద్య రంగం లో విశేష కృషి చేసిన ఫాతిమా షేక్. ఆమె త్యాగం మరియు శ్రద్ద మరియు స్త్రీ విద్య పట్ల గల అంకిత భావం భారతీయ మహిళలకు మార్గదర్శకం....
-----------------------
Admin