సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : రెండు తెలుగు రాష్ట్రాల్లో గత రెండు రోజులుగా కురుస్తున్న ఎడతెరపి లేని వర్షాల వల్ల వరదలు సంభవిస్తున్నాయి. ఈ పరిస్థితిలో ప్రమాదాలు పొంచి ఉన్నందున జర్నలిస్టులు జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. గతంలో తెలంగాణాలో ఇద్దరు, ఆంధ్రాలో ఒకరు వరదల్లో కొట్టుకుపోయిన సంగతి మన అందరికి గుర్తు ఉండనుకుంటున్నాను. వారి కుటుంబాలను యాజమాన్యాలు , ప్రభుత్వాలు కూడా పట్టించుకోలేదు. అది గుర్తుంచుకుని న్యూస్ కవరేజి కోసం, బ్రేకింగ్ న్యూస్ ల కోసం అత్యుత్సాహంతొ వెళ్ళవద్దు. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు, ఫోటో జర్నలిస్టులు చాలా అప్రమత్తంగా ఉండాలని జర్నలిస్టు యూనియన్ నాయకులూ సూర్యాపేట జిల్లా రిపోర్టర్ చిలక సైదయ్య కోరారు ....
-----------------------
Admin