సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : బుక్కపట్నం మేజర్ పంచాయతీలో విధులు నిర్వహిస్తున్న కార్మికులకు ఈశ్వర్ సప్లయర్ నందు నూతన వస్త్రాలు పంపిణీ చేస్తున్న సత్య సాయి జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యదర్శి సామకోటి ఆదినారాయణ అలాగే మాట్లాడుతూ కలియుగ ప్రత్యక్ష దైవం భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య ఆశీస్సులతో,దాదాపు 25 మందికి పైగా మేజర్ పంచాయతీ లో కార్మికులకు నూతన వస్త్రాలను అందించి, మీరు చేస్తున్నటువంటి వృత్తికి దృష్టిలో ఉంచుకొని నా కార్మిక ప్రజలకు ఇస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందని అలాగే ఇలాంటి సేవా కార్యక్రమాలు మా వంతు సహాయంగా నా శక్తికి మించిన సేవా కార్యక్రమాలు ముందు ముందుకు భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య ఆశీస్సులు మాపై ఉంటే ఇంకా చేస్తానని తెలియజేశారు. అలాగే మొన్న విజయదశమి సందర్భంగా మున్సిపల్ కార్మికులకు, డ్రైనేజ్ కార్మికులకు, మున్సిపాలిటీ వాటర్ సప్లయర్స్ కార్మిక సిబ్బందికి దాదాపు 130మందికి పైగా వస్త్రాలు అందించి, అలాగే అకాల వర్షాలు కారణంగా పుట్టపర్తి లో సాయి నగర్ కాలనీ నీట మునగడంతో దాదాపు పది రోజులకు పైగా సేవా కార్యక్రమాలు చేశామని ఆయన తెలియజేశారు.అలాగే నేను చేస్తున్నవంటి కార్యక్రమానికి తమ్మునిగా,అన్నగా భావించి నాకు సహకరించి ప్రతి ఒక్కరు కార్యక్రమాన్ని విజయవంతం చేసి పత్రికల్లో ప్రచారాలు చేస్తున్నటువంటి మా సోదరులు పత్రికా విలేకరులకు,మీడియా సోదరులకు మా ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే త్వరలో లోకేష్ బాబు చేపట్టబోయే పాదయాత్రకు అందరూ కలిసికట్టుగా ఏకతాటి పై పనిచేసి నారా లోకేష్ బాబు ,నారా చంద్రబాబు నాయుడు ,పల్లె రఘునాథ్ రెడ్డి సత్యసాయి బాబా గారి దివ్య ఆశీస్సులు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండి వారికి మంచి ఆయురారోగ్యాలు అన్ని విధముగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బాలు, సత్యసాయి జిల్లా బుక్కపట్నం రైతు సంఘం కార్యదర్శి సామకోటి ఈశ్వరయ్య,పుట్టపర్తి తెలుగు యువత కాంసెన్సీ ఉపాధ్యక్షులు బుల్లె సుధీర్, తెలుగు యువత కుమార్,మాజీ పంచాయతీ ఉపసర్పంచ్ నారాయణస్వామి,సురేంద్ర,శ్రీరాములు,రంగా,చంద్ర, కేశవ,వంశీకృష్ణ,ప్రసాద్ జీ, నారాయణస్వామి,రెడ్డి కేసి తదితరులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు,కార్మిక సిబ్బంది పాల్గొన్నారు.
-----------------------
Admin