సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మోతే మండలం కేంద్రం లో జరుగుతున్న మూడవ రోజు సమ్మె కు మద్దతు తెలిపి గంట నాగయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో 12,769 గ్రామపంచాయతీలో పనిచేస్తున్న 60 వేల కార్మికులకు వేతనాలు పెంచి పర్మినెంట్ చేయాలని, ప్రమాద బీమా 10 లక్షలు కట్టాలని, కార్మికులందరికీ పిఎఫ్ ,ఈఎస్ఐ చట్టాలను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిది గంటల పని విధానాన్ని కొనసాగించాలని రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలని, కారోబార్లకు పదోన్నతి కల్పించాలని, పంచాయతీ కార్మికులు పేదలు దళితులు కనుక వాళ్లకు ఇండ్ల స్థలాలు, డబుల్ బెడ్రూంలో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఆయన కోరారు. చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్న మా కార్మికుల కన్నీటి ఘోష ప్రభుత్వానికి అర్థం కావట్లేదా? అని ప్రశ్నించారు. జీవో 51 రద్దుచేసి, ఉద్యోగ భద్రత కల్పించాలని ఆయన కోరారు. పెరుగుతున్న ధరలను దృష్టిలో పెట్టుకొని జెఎసి పెట్టిన డిమాండ్స్ ని పరిష్కరించాలని, ఎమ్మెల్యేలు కేసీఆర్ తో మాట్లాడి మా సమస్య పరిష్కారానికి కృషి చేయాలని ఆయన కోరారు. ఐ ఎఫ్ టి యు జిల్లా ఉపాధ్యక్షులు కుణుకుంట్ల సైదులు జే ఏ సి నాయకులు రవిచంద్ర,జలగం తిరపయ్య, స్కై లాబ్,ఉపేందర్,వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin