Wednesday, 29 July 2026 02:36:47 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

మామిడిపల్లి కౌన్సిల్లో సీనియర్ సిటిజన్ అసోసియేషన్ ప్రారంభించారు...

Date : 19 January 2024 10:24 AM Views : 447

సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని మామిడిపల్లిలో అనంత ఆంజనేయ స్వామి సీనియర్ సిటిజన్ అసోసియేషన్ ప్రారంభించారు. ప్రారంభ సమావేశానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర సీనియర్ సిటిజన్ వర్కింగ్ అధ్యక్షుడు, జాతీయస్థాయి కార్యవర్గ సభ్యులు భూమన హాజరైనారు. ఆయన ఇట్టి కార్యక్రమంలో మాట్లాడుతూ 60 సంవత్సరాలు పూర్తి అయిన వారు కుల మత వర్గ విభేదాలు లేకుండ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. వయా వృద్ధులకు కుటుంబంలో ప్రాధాన్యత ఇవ్వకుండా వారిపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన చట్ట ప్రకారం గా తగు చర్యలు తీసుకోబడునని ప్రతి ఒక్కరికి డబ్బు ముఖ్యం కాదని మానసిక ఉల్లాసం సేవ భావం కలిగి ఉండాలని భూమన్న చెప్పారు. వృద్ధులకు సమస్యలు ఏమైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. పాఠశాలలో పేద విద్యార్థులకు ఉచితంగా నోట్ బుక్స్ బీదవృద్ధులకు చేతి కర్రలు, ఆరోగ్యపరంగా హెల్త్ క్యాంపులు నిజాంబాద్ వమౌ వృద్ధుల సంక్షేమ సంఘం ద్వారా ఏర్పాటు చేస్తున్నామని జిల్లా ప్రధాన కార్యదర్శి పి.రాజిరెడ్డి తెలిపారు. ఇట్టి సమావేశానికి జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, సంయుక్త కార్యదర్శి విజయ్ కుమార్, సీనియర్ సిటిజన్ అసోసియేషన్ ఆర్మూర్ శాఖ అధ్యక్షులు వర్మ, కోమన్ పల్లి సీనియర్ సిటిజన్ అధ్యక్షులు బండి సాయన్న, ఇస్సపల్లి సీనియర్ సిటిజన్ అధ్యక్షులు నారాయణ, మామిడిపల్లి కౌన్సిలర్ రవి గౌడ్, కాశిరాం తదితరులు పాల్గొన్నారు. వయోవృధులకు సంక్షేమానికి 21000 రూపాయలు నగదును ఆర్థిక సాయం చేసి తన సేవా భావాన్ని చాటుకున్నారని. మరికొందరు కూడా ఆర్థిక సాయం అందించారని వారు తెలిపారు. మామిడిపల్లి లో సీనియర్ సిటిజన్ అసోసియేషన్ కార్యవర్గ కమిటీ ప్రకటించారు. అధ్యక్షునిగా మల్యాలపోశెట్టి, ఉపాధ్యక్షుడుగా పవన్ రెడ్డి, ప్రధానకార్యదర్శిగా నడిపి మ ల్లయ్య, సంయుక్త కార్యదర్శిగా బి సాయిలు, కోశాధికారిగా లక్కారం పోశెట్టి...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :