సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడొద్దు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి పార్టీ మండల కార్యదర్శి సాదు నర్సింగరావు సర్కార్ న్యూస్ వరంగల్ జిల్లా చెన్నారావుపేట పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని, విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడొద్దని బిఆర్ఎస్ పార్టీ చెన్నారావుపేట మండల కార్యదర్శి సాధు. నర్సింగరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు చెన్నారావుపేట మండల కేంద్రంలోని విలేకరులతో మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న తొమ్మిది వేల కోట్ల రూపాయల ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు 22 నెలల నుండి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు కళాశాలలకు చెల్లించకపోవడంతో అటు కళాశాలలు నడవలేని పరిస్థితుల్లో అలాగే ఫీజు రియంబర్స్మెంట్ అందక విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం కేవలం ప్రకటనలకు మాత్రమే పరిమితం అవుతుందని నర్సింగరావు ధ్వజమెత్తారు. అందాల పోటీల నిర్వహణకు అందాల భామల కేవలం భోజన ఖర్చుకు అక్షరాల 1 లక్ష రూపాయలు వెచ్చించే ప్రభుత్వం అలాగే హెలికాప్టర్ సహాయం లేకుండా వంద కిలోమీటర్లు కూడా ప్రయాణం చేయలేని మంత్రుల ఖర్చులను భరించే ప్రభుత్వం విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయమంటే మాత్రం కుంటి సాకులు చెప్పడం విడ్డురంగా ఉందని నర్సింగరావు ఎద్దేవా చేశారు. విద్యార్థులకు కనీసం ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేని ప్రభుత్వం లక్షన్నరకోట్లతో మూసినదిని ప్రక్షాళన చేస్తామని చెప్పడం హాస్యాస్పదమని అన్నారు.విద్యాశాఖ మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి వెంటనే స్పందించి పెండింగ్ లో ఉన్న ఫీజు రీ ఆంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేసి విద్యార్థుల భవిష్యత్ కు పునాది వేయాలని విజ్ఞప్తి చేసారు.
-----------------------
Reporter