సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : దుమ్ముగూడెం మండల పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్సై గణేష్ సిబ్బందితో కలిసి సోమవారం ఉదయం స్థానికుల సమాచారం మేరకు లక్ష్మినగరం గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 7 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని పట్టుకొని సివిల్ సప్లై వారికి అప్పగించడమైంది. ఇంకా ఎవరైనా రేషన్ బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేసినా, తరలించినా వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఎస్సై గణేష్ తెలిపారు , సిబ్బంది హెచ్ సి కృష్ణ, పీసీ నరేష్ పాల్గొన్నవారు...
-----------------------
Admin