సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : కేశంపేట్ మండల్ : రోడ్డు ప్రమాదంలో గత రెండు నెలల క్రితం మృతి చెందిన బిఆర్ఎస్ కార్యకర్త, మాజీ వార్డు సభ్యుల పోగుల జంగయ్య కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని ఎంపీపీ రవీందర్ యాదవ్ అన్నారు. సోమవారం షాద్ నగర్ నియోజకవర్గం కేశంపేట్ మండల పరిధిలోని తొమ్మిది రేకుల గ్రామంలో మృతుని భార్య యాదమ్మ కు రెండు లక్షల రూపాయల నగదును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు. ఎంపీపీ రవీందర్ యాదవ్ లక్ష రూపాయలు, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ లక్ష్మీనారాయణ గౌడ్ ఇరువై వేలు, వార్డు సభ్యులు యాదగిరి ఇరువై వేలు, గ్రామ సర్పంచ్ సావిత్రి బాలరాజు గౌడ్ 15000, ఉపసర్పంచ్ రామ్ రెడ్డి 10000, ఎంపిటిసి యాదగిరి 10,000 రూపాయలు, నాగిళ్ళ రాములు 10000, శ్రీనివాస్ గౌడ్ 5000 రూపాయలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నారాయణరెడ్డి సింగిల్ విండో చైర్మన్ జగదీశ్వర్ గౌడ్ కోఆప్షన్ సభ్యులు జమాల్ ఖాన్ పర్వత్ రెడ్డి, నాయకులు గోష్క ఆంజనేయులు, నర్సింలు, దర్శన్, లాలమోని నరసింహులు, పోగుల నర్సింలు, చాకలి మల్లయ్య, సుదర్శన్, మల్లయ్య, అరవింద్, కృష్ణయ్య, రంగయ్య, చంద్రయ్య గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin