సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవర చెరువు మండలము జెరికుంటపల్లిలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను మండల అభివృద్ధి అధికారి పోలప్ప, మండల విద్యాశాఖాధికారి ఖాదర్ వలీ భాష మంగళవారం సందర్శించారు. పాఠశాలలో 14 మంది విద్యార్థులు గాను ఒకే ఉపాద్యాయుడు శంకర రెడ్డి విధులు నిర్వహిస్తున్నాడు. మండల అభివృద్ధి అధికారి పోలప్ప పరిశీలనలో విద్యార్థులకు సంబంధించిన రిజిస్టర్, పలు రికార్డులు సక్రమంగా నిర్వహించకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులు విద్యాస్థాయి పైన కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, పాఠశాల విధి నిర్వహణ అలసత్వంపై ఉపాధ్యాయుడిని సంజాయిషీ అడగమని మండల విద్యాధికారి ఖాధర్ వలి భాషాను ఆదేశించారు....
-----------------------
Admin