సర్కార్ టీవీ న్యూస్ / అనంతపురం జిల్లా : అనంతపురం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి, ఈరోజు నిర్వహించిన " స్పందన " కార్యక్రమంలో 79 పిటీషన్లు స్వీకరించారు. జిల్లా నలమూలల నుండీ విచ్చేసిన ప్రజలు తమ బాధలు, సమస్యలను స్వేచ్ఛగా చెప్పుకుని పిటీషన్లు అందజేశారు. ప్రతీ పిటీషనర్ తో జిల్లా ఎస్పీ ముఖాముఖిగా మాట్లాడారు. కుటుంబ కలహాలు, ఫోర్జరీలు, అత్తారింటి వేధింపులు, చిన్న చిన్న వివాదాలు, తదితర సమస్యలను విన్నవించారు. చట్టపరిధిలో సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపాలని సంబంధిత పోలీసు అధికారులకు ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. దేవా చారిటబుల్ ట్రస్టు సహకారంతో స్పందన పిటీషనర్లకు ఉచిత భోజన సౌకర్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ నాగేంద్రుడు, తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin