సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : బూర్గంపాడు మండలం, లక్ష్మీపురం గ్రామంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మండల బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ... ప్రతిపక్షాలపై కేసుల దాడి.. ప్రజలపై ధరల దాడి..ఇవి తప్ప కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం సాధించింది ఏమీ లేదు అని తెలిపారు.. కేసీఆర్ నాయకత్వంలో దేశంలో బీఆర్ఎస్ పురోగమిస్తున్న విధానం.... దేశంలో మిగిలిన ఏ రాష్ట్రాలలో లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధితో.. సంక్షేమ పథకాలతో.. కెసిఆర్, బీఆర్ఎస్...ఒక అజేయమైన శక్తిగా ఎదగడం సహించలేని నరేంద్ర మోడీ.. ఇక ప్రజాక్షేత్రంలో కెసిఆర్ తో తలపడలేమని దొంగ నాటకాలకు తేరలేపాడు.. కెసిఆర్ ని డైరెక్ట్ గా ఎదుర్కొనే దమ్ము లేక తన జేబుసంస్థ ఈడి ద్వారా ఎమ్మెల్సీ కవితకు సమన్లు పంపాడు.ఇవి ఈడీ సమన్లు కాదు.. కచ్చితంగా మోదీ సమన్లు. ఇది రాజకీయంగా చేసే చిల్లర ప్రయత్నం. సీబీఐ, ఈడీ, ఐటీ కేంద్రం చేతుల్లో కీలుబొమ్మలు. అదానీ లాంటి బినామీలను అడ్డుపెట్టుకొని సంపాదించిన అడ్డమైన దొంగ సొమ్ముతో ప్రజల పక్షాన నిలబడ్డ పార్టీలను చీల్చి, లొంగని వారిపై ఈడీ, సీబీఐ దాడులు చేయించడమే పనిగా పెట్టుకుంది కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం... ఇలాంటి పిట్ట బెదిరింపులకు తెలంగాణ సమాజం తలవంచదు.. భయపడదు... ఖబడ్దార్ నరేంద్ర మోడీ.. ఇప్పటికైనా ప్రభుత్వ దర్యాప్తు సంస్థలను.. ప్రజా ప్రభుత్వాలను కూల్చడానికి,స్వార్ధ ప్రయోజనాలకు వాడితే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది... అని తెలిపారు.. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత, ఏఎంసి చైర్మన్ పోడియం ముత్యాలమ్మ, సొసైటీ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గోపిరెడ్డి రమణారెడ్డి, బీఆర్ఎస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్ ,బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పోడియం నరేంద్ర తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin