సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవర చెరువు మండల పరిధిలోని నవాబ్ కోట గ్రామానికి చెందిన వలిపి. శ్రీనివాసులు కూతురు వలిపి సుహాసిని (15) టెన్త్ క్లాస్ ఫెయిల్ అవడంతో మనస్థాపం చెంది ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు కొండ కమర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్నది పరీక్షల్లో ఫెయిల్ అయిందని మనస్థాపం చెంది ఇంట్లో ఎవరు లేనప్పుడు చీరతో దూలాని ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. శ్రీనివాసులకు కొడుకు కూతురు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వు కదిరి ప్రభుత్వ ఆసుపత్రి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
-----------------------
Admin