సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : బూర్గంపాడు మండలం అభ్యుదయ భావాలకు ఆకర్షితులై ఆనాటి కాలంలో వామపక్ష పార్టీ సిపిఐ పార్టీలో కీలకపాత్ర పోషిస్తూ అనుబంధ విభాగమైన కార్మిక సంఘం ఏఐటీయూసి లో తమదైన శైలిలో కార్మికులకు న్యాయమైన కోరికలు తీర్చడంలో పోరాటాలు చేసి న్యాయమైన కార్మికుల కోర్కెలు, వేతనాలు అందేలా తమ వంతు కృషి చేసినటువంటి ఐటిసి పిఎస్పీడీ భద్రాచలంయూనిట్ కార్మిక నేతలు సోమవారం ఆ పార్టీకి రాజీనామా చేసి ఆర్పిఐ పార్టీలో చేరినట్లుగా విలేకరుల సమావేశంలో వెల్లడి చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీటీసీ, మాజీ మండల సెక్రెటరీ ఏఐటియూసి వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేసిన కేసుపాక నరసింహారావు, ఏఐటియూసి జనరల్ సెక్రటరీగా పనిచేసిన ఇస్రం శ్రీనివాస్ రావు, ఏఐటియూసి వైస్ ప్రెసిడెంట్ కె.వి.ఆర్ మూర్తి మాట్లాడుతూ. ఎన్నో సంవత్సరాలుగా ఆ సంఘంలో పనిచేసి ఎంతో గుర్తింపు పొందిన నేతలపై ఆ పార్టీలో పలువురు వివక్షత చూపించడంతో పాటు కార్మికులకు న్యాయం చేయలేని పరిస్థితుల్లో సోమవారం ఆ పార్టీకి రాజీనామా చేసి ఆర్పిఐ పార్టీలో బాధ్యతలు స్వీకరించినట్లుగా పేర్కొన్నారు. రిపబ్లిక్ పార్టీ ఆఫ్ నేషనల్ చైర్మన్ కేంద్ర సామాజిక న్యాయశాఖ మంత్రివర్యులు రాందాస్ హతావలే రెండు తెలుగు రాష్ట్రాల జాతీయ నేత శివ నాగేశ్వరరావు గౌడ్ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మద్దిశెట్టి సామెల్ ఆదేశాలతో ఆర్ పి ఐ పార్టీలో బాధ్యతలు స్వీకరించినట్లుగా విలేకరుల సమావేశంలో తెలియజేశారు. తమపై ఎంతో నమ్మకంతో ఆర్పీఎఫ్ పార్టీలో కీలక బాధ్యతలు అప్పజెప్పిన అగ్రనేతలకు ధన్యవాదాలు తెలియజేశారు రాబోయే రోజుల్లో ఐటిసి పిఎస్పీడీ కర్మగారంలో కార్మికుల నేతల పక్షాన జిల్లా ప్రజల పక్షాన తమ వంతు కృషిని చేస్తూ ప్రజా సమస్యలపై పోరాడుతూ కార్మికులకు న్యాయం జరిగేందుకు, కార్మిక సమస్యలు పరిష్కార దిశగా పనిచేసేందుకు తమ వంతు కృషిని అందజేయనుటట్లుగా ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. వీరు ఏఐటియూసి సిపిఐ పార్టీ నుండిబయటకు రావడంతో ఆ పార్టీకి తీరని నష్టం వాటలునట్లుగా తెలుస్తుంది .ఇప్పటికే ఆ పార్టీ ఉనికి అంతంత మాత్రమే కనిపిస్తూ ఉంది.రాబోయే రోజుల్లో కీలక నేతలు ఆర్పిఐ పార్టీలోకి చేరడంతో మరింత నష్టం వాటిలో ప్రమాదం ఉన్నట్లుగా విశ్లేషకులు రాజకీయ నిపుణులు వెల్లడిస్తున్నారు. పార్టీలో ఎన్నో సంవత్సరాలుగా పనిచేసిన నాయకులు ఆర్.పి.ఐ పార్టీలో చేరడం ఆ పార్టీకి తీరని నష్టం గానే తెలుస్తుంది...
-----------------------
Admin