సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : నియోజకవర్గంలో ఎక్సైజ్ అధికారులు మద్యం సిండికేట్ కు అనుమతి ఇచ్చరా ? లేకపోతే సిండికేట్ వ్యాపారులకు అమ్ముడుపోయారా...? అని బీఎస్పీ పార్లమెంట్ జోనల్ ఇంచార్జ్ యెర్రా కామేష్ ప్రశ్నించారు.గురువారం కొత్తగూడెం క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో యదేచ్చగా సిండికేట్ మద్యం దందా నడుస్తున్నా మామూళ్ళ కు అలవాటు పడిన ఎక్సైజ్ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని,ఎమ్మెల్యే గా కూనంనేని గెలిచాక పాల్వంచలో సిండికేట్ దందా నడిపే ఆయన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి జిల్లా కేంద్రంలో మద్యం దుకాణాలు దక్కించుకున్న వారితో నిబంధనలకు విరుద్ధంగా స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేసుకొని సిండికేట్ దందా నడిపిస్తున్నాడని ఆరోపించారు.ఏ పార్టీ నాయకుడు ఎమ్మెల్యే గా గెలిచినా లక్షల రూపాయలు ఇస్తూ జిల్లా నియోజకవర్గంలో సిండికేట్ వ్యాపారం ద్వారా కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయని దీనిపై ఎన్ ఫోర్స్ మెంట్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.మద్యం సిండికేట్ దందాపై ఇప్పటికే జిల్లా కలెక్టర్,ఎస్పీకి సైతం వినతి పత్రాన్ని అందజేసినట్లు తెలిపారు.ఇప్పటికైనా ఎక్సైజ్ అధికారులు మొద్దునిద్ర వీడి సిండికేట్ దందా నడుపుతున్న వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని,లేనిపక్షంలో ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో సాయి,అసెంబ్లీ అధ్యక్షుడు చేనిగరపూ నిరంజన్ కుమార్,అసెంబ్లీ ఇంచార్జ్ నాగుల రవికుమార్,అల్లకొండ శరత్,ధనుంజయ్ తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin