సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబులదేవర చెరువు మండలం కేంద్రంలోస్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో విద్యార్థిని , విద్యార్థిలుకు జగన్న విద్యా కిట్లును పంపిణి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎంపీపీ పర్వీన్ భాను, జడ్పిటిసి దామోదర్ రెడ్డి, పట్టణ కన్వీనర్ కోళ్ల కృష్ణారెడ్డి, సర్పంచ్ గోవిందు వారి చేతులు గా విద్యార్థులు కు పంపిణి చేయడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూఏపీలో ఇవాళ్టి నుంచి స్కూళ్లు తెరుచుకోనున్నాయి. ప్రభుత్వ బడులకు వెళ్లే విద్యార్ధులకు అవసరమైన వస్తువులతో కూడిన విద్యా కానుక కిట్లను సీఎం జగన్ పంపిణీ చేయనున్నారు.2023-24 విద్యా సంవత్సరానికి జగనన్న విద్యాకానుక పంపిణీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో ఒకటి నుండి పదవ తరగతి వరకుచదువుతున్న 43,10,165 మంది విద్యార్థినీ, విద్యార్థులకు రూ. 1,042.53 కోట్ల ఖర్చుతో ఈ కిట్లను పంపిణీ చేస్తున్నారు. పల్నాడు జిల్లా పెద కూరపాడు నియోజకవర్గంలోని క్రోసూరులో ఈ కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించనున్నారు.. విద్యా కానుక కిట్లో ప్రతి విద్యార్థికి ఉచితంగా ఇంగ్లోష్-తెలుగులో ముద్రించిన పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్, వర్క్ బుక్స్, 3 జతల యూనిఫామ్ క్లాత్ కుట్టు కూలితో సహా ఇస్తారు. దీంతో పాటు ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, స్కూలు బ్యాగుతో పాటు 6-10 తరగతి పిల్లలకు ఆక్స్ఫర్డ్ ఇంగ్లీషు-తెలుగు డిక్షనరీ, 1-5 తరగతి పిల్లలకు పిక్టోరియల్ డిక్షనరీతో కూడిన విద్యాకానుక కిట్ ను స్కూల్ ప్రారంభమైన తొలిరోజే అందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్ పార్టీ రాష్ట్ర మైనార్టీ నాయకులు తుమ్మల షామీర్ భాష, మండల వ్యవసాయ అగ్రి అడ్వెంచర్ చైర్మన్ లక్ష్మిరెడ్డి, మండల కన్వీనర్ రాజు నాయుడు, జమ్మలమడుగు జానీ , స్కూల్ కమిటీ చైర్మన్ జయచంద్ర నాయుడు, ప్రధాన ఉపాధ్యాయులు శోభ రాణి, ఉపాధ్యాయలు, తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin