Wednesday, 29 July 2026 07:19:49 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

శాంతి స్థాపనకు కృషి అభినందనీయం... - యం.యల్.ఏ కూనంనేని సాంబశివ రావు

Date : 08 January 2024 12:49 AM Views : 241

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : పాల్వంచ : క్రిస్టియన్ మైనార్టీ సంస్థలు సమాజంలో శాంతి స్థాపనకు కృషి చేయడం అభినందనీయమని, సమాజహితం కోసం వారు చేస్తున్న కృషికి తనవంతు సహకారాన్ని అందిస్తానని కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. ఆదివారం బెరాక చర్చ్ నందు ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొన్న కూనంనేని మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించినందుకు కృతజ్ఞుణ్ణి ఉంటానని, ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తాను అన్నారు. తాను ఎమ్మెల్యేగా పనిచేసిన కాలంలోని నియూజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని, గతం కంటే మరింత అభివృద్ధి చేసేందుకు, ప్రభుత్వం నుంచి పెద్ద మొత్తంలో నిధులు రాబట్టేందుకు ఇప్పటికే ప్రణాళిక రూపొందించామని అన్నారు. నియోజవర్గంలో మరింత అభివృద్ధి సాదించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని స్పష్టం చేశారు. ప్రతి గ్రామానికి, వార్డుకు కనీస మౌలిక వసతులు కల్పించడంతోపాటు, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబానికి అందించేందుకు చర్యలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాష, పట్టణ కార్యదర్శి అడుసుమిల్లి సాయిబాబు, మండల కార్యదర్శి వీసంశెట్టి పూర్ణచంద్రరావు, జిల్లా సమితి సభ్యులు దుగ్గిరాల సుధాకర్, గుండాల నాగరాజు, నాయకులు అన్నారపు వెంకటేశ్వర్లు, శనగరపు శ్రీనివాస్ రావు, ఇట్టి వెంకట్రరావు, గిరి, జకరయ్య, పాషా, బెరాక చర్చ్ సభ్యులు బ్రదర్ ఐజాక్, మోజేష్ చారి, నాగేశ్వరరావు, సుగుణరావు, ప్రసాదరావు, స్వామిదాస్, జాకబ్ తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :