సర్కార్ టీవీ న్యూస్ / నారాయణపేట జిల్లా : మక్తల్ మండలం, కర్ని గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం పేరెంట్స్ & టీచర్స్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి విద్యార్థుల తల్లిదండ్రులు, సంరక్షకులు అధిక సంఖ్యలో హాజరై తమ పిల్లల ప్రగతి గురించి ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు రఘువీర్ మాట్లాడుతూ... రోజు విద్యార్థులను పాఠశాలకు పంపించే బాధ్యత పిల్లల తల్లిదండ్రులది, సంరక్షకులదే నని , ముఖ్యంగా 10వ తరగతి చదువుతున్న విద్యార్థుల పట్ల శ్రద్ధ వహించి వారిని ఉన్నత స్థానానికి చేరుకోవడానికి చొరవ చూపాలని తల్లిదండ్రులను కొనియాడారు. 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు పోటాపోటీ గా చదివి ఉత్తమ ఫలితాలు సాధించి ఇటు తల్లిదండ్రులకు, అటు పాఠాలు బోధించిన ఉపాధ్యాయులకు మంచి పేరు, ప్రతిష్ఠలు తీసుకురావాలని ఆయన సూచించారు. ఇంకో నెల రోజుల్లో పదవ తరగతి పరీక్షలు ఉన్నందున విద్యార్థిని, విద్యార్థులు గైహాజరు కాకుండా రోజు పాఠశాలకు హాజరు కావాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల SMC చైర్మన్ జెల్లి రంగప్ప, ఉపాధ్యాయ బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు, సంరక్షకులు, తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin