సర్కార్ టీవీ న్యూస్ / నారాయణపేట జిల్లా : మక్తల్ నియోజకవర్గ కేంద్రంలో మాధాసి కురువ/మధారి కురువ... యస్ సి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కుల ధృవీకరణ పత్రాల సాధనకై నిర్వహించిన నిరసన దీక్షలో పాల్గొన్న నారాయణపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వాకిటి శ్రీహరి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మీరు కోరుతున్న కోరిక న్యాయమైనదని ప్రభుత్వం మాధసి కురువ/మాధరి కురువలకు తీరని ద్రోహం చేసింది అని అన్నారు. ఇకనైనా ప్రభుత్వం కళ్లు తెరిచి, మాదసి కురువలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మాధాసీ కురువలకు తగిన న్యాయం చేకూరేలా చేస్తామని కాంగ్రెస్ పార్టీ తరుపున హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాగన్న, శ్రీనివాస్ రెడ్డి, నియోజకవర్గ యూత్ జోడో బూత్ జోడో యూత్ కాంగ్రెస్ ఇంఛార్జి రామ్ సింగ్ నాయక్, రవి కుమార్, మహేష్, గోవర్ధన్, రమేష్ మరియు వివిధ పార్టీల నాయకులు , కార్యకర్తలు మరియు మాదాసీ కురువలు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin