సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : ఖమ్మం నగరంలోని ఒక ప్రైవేటు కళాశాలలో ఆదివారం విషాద ఘటన చోటు చేసుకుంది. విద్యార్థిని బిల్డింగ్ పైన దూకి ఆత్మహత్యానికి పాల్పడిన ఘటన జరిగింది. శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఎంపీసీ చదువుతున్న చైతన్య (17) అనే విద్యార్థిని కాలేజీలో రెండు అంతస్తుల నుంచి కిందికి దూకింది. వెంటనే కళాశాల యాజమాన్యం నగరంలోని కిమ్స్ హాస్పిటల్కి తరలించారు. విద్యార్థిని చైతన్యకు తీవ్ర గాయాలైనట్టు విద్యార్థులు తెలుపుతున్నారు. కాలేజీలో టీచర్ మందలించినట్టు సమాచారం. విద్యార్థిని నేలకొండపల్లి చెందిన వాసిగా గుర్తించారు. విద్యార్థిని తల్లిదండ్రులకు సమాచారం తెలియడంతో వారు ఖమ్మం బయలుదేరారు. శ్రీ చైతన్య కళాశాలలో ఇలాంటి సంఘటనలు ఇప్పటివరకు మూడు జరిగాయని విద్యార్థులు తెలుపుతున్నారు. కళాశాల యాజమాన్యం ఫీజు కోసం వేధింపులు చేస్తున్నారని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి...
-----------------------
Admin