సర్కార్ టీవీ న్యూస్ / నల్గొండ జిల్లా : చందంపేట మండలం, క్రీడలలో ప్రతి ఒక్కరు రాణించాలి అని దేవరకొండ శాసన సభ్యులు,బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు.బుధవారం చందంపేట మండలం గన్నేర్లపల్లి గెట్ వద్ద టిఆర్ఎస్ జిల్లా నాయకులు రమావత్ లాలు నాయక్ స్మారక జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ను ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ గారు మాట్లాడుతూ....క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్థాయి అని ఆయన అన్నారు.రెపటి తరానికి క్రీడలు ఎంతో దోహదపడుతాయి అని ఆయన అన్నారు.ప్రతి ఒక్కరు క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలి అని ఆయన కోరారు.క్రీడాకారులకు, కళాకారులకు తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు. అలాగే క్రీడలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.అనంతరం లాలు నాయక్ చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో సర్పంచుల చందంపేట యువకులు, బిఎస్ఆర్ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు .....
-----------------------
Admin