సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ పట్టణంలోని గోవిందపురం లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. గోవిందపురంలో ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి , స్మశాన వాటికకు గోవిందాపురంలో సిసి రోడ్డు , డ్రెయిన్స్ కి శంకుస్థాపన మొత్తం 26 లక్షల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన లు ఈ సందర్భంగా శాసనసభ్యులు శ్రీ శానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ గత మూడు సంవత్సరాల క్రితం గోవిందపురం ఎలా ఉండేది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసని మరియు ఇప్పుడు గోవిందపురం ఇలా ఉందో ప్రత్యక్షంగా చూస్తున్నారని ఇంకా అభివృద్ధి నిమిత్తమై ఎస్సీ కమ్యూనిటీ హాల్ ని స్మశానవాటికనే మరి మిగిలిపోయిన వాటికి సిసి రోడ్స్ డ్రైయిన్స్ ని కూడా మరి ఇప్పుడు శంకుస్థాపన చేసుకున్నామని ఇవన్నీ కూడా కొద్ది రోజుల్లో పూర్తి అవుతాయని ఇంకా ఏమైనా మిగిలి ఉంటే వాటిని కూడా పూర్తి చేసుకొని హుజూర్ నగర్ పట్టణంలోని గోవిందపురం నెంబర్ వన్ స్థాయికి అందరం కలిసి తీసుకొని వద్దామని అభివృద్ధిని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆపేయలేదని ఎన్ని అడ్డంకులు వచ్చినా అభివృద్ధిని చేసి తీరుతామని రాజకీయాల్లోకి వచ్చింది అభివృద్ధిని సాధించడానికి దీనికి అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలని ప్రజలందరూ కూడా పనిచేసే పార్టీలకే పని చేసే అభ్యర్థులకే మద్దతునివ్వాలని ఈ సందర్భంగా తెలియజేశారు. గోవిందపురంలో ఇటీవల మరణించిన టిఆర్ఎస్ పార్టీ కార్యకర్త కందుల గోపయ్య కుటుంబాన్ని సందర్శించి వారి చిత్రపటానికి పూలమాలలు సమర్పించి శ్రద్ధాంజలి ఘటించి ఆ కుటుంబానికి తనున్నానని ఏ సహాయం వచ్చిన తనను కలుసుకోవాలని భరోసా ఇస్తూ ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అనారోగ్యంతో బాధపడుతున్న మన్యం విరంజి , ఆమడల లక్ష్మయ్య గార్ల ఇంటికి వెళ్లి వారిని పలకరించి యోగక్షేమాలు విచారించి చికిత్స విధానాన్ని తెలుసుకొని మెరుగైన వైద్యం కోసం అవసరమైతే హైదరాబాద్ కు వెళ్లాలని తాను ఏర్పాట్లు చేస్తానని వారికి తెలియజేస్తూ వారికి మందుల నిమిత్తమై కొంత ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు నాయకులు పెద్దలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin