సర్కార్ టీవీ న్యూస్ / ప్రకాశం జిల్లా : యర్రగొండపాలెం : జగన్మోహన్ రెడ్డి తోనే మాదిగల సంక్షేమం సాధ్యమని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర కో కన్వీనర్ షాలేంరాజు మాదిగ అన్నారు. మంగళవారం ఎర్రగొండపాలెం లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బాబు నాయుడు ప్రభుత్వంలో మాదిగలకు జరిగింది ఏమీ లేదన్నారు. కేవలం ఓటు బ్యాంకుగా వాడుకున్నారే తప్ప సంక్షేమ పథకాల ఊసే లేదని ఆయన ఆరోపించారు. వర్గీకరణ పేరుతో తెలంగాణకు చెందిన మందకృష్ణ మాదిగ ఆంధ్రప్రదేశ్ లోని మాదిగ సోదరులను మోసం చేస్తున్నారని విమర్శించారు. అమాయకులైన మాదిగ సోదరులు మందకృష్ణ చెప్పే మోసపు మాటలను నమ్మవద్దని హితవు పలికారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మాదిగ వర్గానికి చెందిన తానేటి వనితను హోం మంత్రిగా చేశారని గుర్తు చేశారు. అంతేకాకుండా డాక్టర్ ఆదిమూలపు సురేష్ ను 2 పర్యాయాలు మంత్రిగా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కిందని గుర్తు చేశారు. గతంలో సికింద్రాబాద్ లోని పరెడ్ గ్రౌండ్ లో నరేంద్ర మోడీని తీసుకొచ్చి ఏర్పాటు చేసిన సభ జాతిని మోసం చేసేందుకే అని తెలిపారు. మాల సోదరుల పట్ల తాము ఏనాడు వివక్ష చూపలేదని అన్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడును గెలిస్తే మాదిగలు అన్యాయానికి గురవుతారని ఆయన అన్నారు. అదే వైసీపీ గెలిస్తే పేదలందరి గెలుపు అవుతుందని ఆయన అన్నారు. మందకృష్ణ మాదిగ కు చెందిన కొందరు చెప్పే కల్లబొల్లి మాటలు నమ్మవద్దని స్పష్టం చేశారు. యర్రగొండపాలెం నియోజకవర్గం నుండి వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న చంద్రశేఖర్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించేందుకు సోదరులంతా కృషి చేయాలని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఎమ్మార్పీఎస్ కో కన్వీనర్ పీటర్ మాదిగ, ఎన్ . జయరాజ్, త్రిపురా మాదిగ, నాగరాజు, చిన్ని, ముటుకూరి . రాజు మాదిగ తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin