సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : తొమ్మిదేళ్లుగా మాజీ ఎంపీ పొం గులేటి శ్రీనివాసరెడ్డితో కలసి ప్రయాణిస్తున్న బి ఆర్ఎస్ నాయకుడు డాక్టర్ మట్లా దయానంద్ విజయకుమార్ రాజకీయ ప్రయాణం ఎటువైపు అని నియోజకవర్గ ప్రజ లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మాజీ ఎంపీ పొంగు లేని శ్రీనివాసరెడ్డి భారతీయ జనతాపార్టీలో చేరుతు న్నా రని ప్రచారం జరుగుతున్న వేళ. ఇప్పటి వరకూ ఆయన ప్రధాన అనుచరుడిగా ఉన్న డాక్టర్ దయానంద్ మాత్రం 'ఆయన వెంట నడిచేందుకు సుముఖంగా లేరని ఆయన సన్నిహితులు చెపుతున్నారు. రాష్ట్రంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయ సంచలనాలకు వేదికగా మారింది. ఈ క్ర మంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి నియోజ కవర్గం వైపు పలువురు ఆసక్తిగా చూస్తున్నారు. సత్తుపల్లి నియోజకవర్గంలోని కల్లూరు మండలం నారాయణపురం గ్రామానికి చెందిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీజేపీలో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతూండటంతో అందరి దృష్టి సత్తుపల్లి వైపు మళ్లింది. ఈక్రమంలో పొంగులేటి అనుచరుడు డాక్టర్ దయానంద్ ఆయనతో కలసి వెళ్ళే విషయంలో అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి....
-----------------------
Admin