సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : పాలకవీడు సమాజంలో ,కుల,వర్ణ,వర్గ,వికలాత్వ,లింగ వివక్షత చూపితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ ఐ ఎం. లింగయ్య యాదవ్ తెలిపారు. శుక్రవారం నాడు రెవెన్యూ శాఖ అధ్వర్యంలో నాగిరెడ్డి గూడెం ఆవాస గ్రామం బెట్టేగుడెం లో జరిగిన పౌర హక్కుల దినోత్సవం లో పాల్గొని మాట్లాడారు. చట్టం ముందు అందరూ సమానమే అని, అందరికీ సమాన హక్కులు ఉన్నాయని,ఎవరైనా బడి,గుడి, ఫంక్షన్, ఇతర సమావేశాలలో వివక్షా చూపిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటమని,గ్రామంలో ఎవరైనా న్యూసెన్స్ చేసిన,బాలికలు, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన తమ దృష్టికి తీసుకురావాలని,అదేవిధంగా ప్రస్తుతం జరిగే సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా అపరిచిత వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపిస్తే సమాచారం అందించాలని,శాంతిభద్రతలు కల్పించే విధంగా పౌరులందరు పోలీస్ సిబ్బందికి సహకారం అందించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎంపిటిసి ల ఫోరమ్ మండల అధ్యక్షులు మీసాల ఉపేందర్, ఎంఆర్ఐ నర్సయ్య, వివిధ శాఖల సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు.
-----------------------
Admin