సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : కల్లూరు మండలం మర్లపాడు గ్రామంలో గత 12 రోజులుగా మాడుగుల స్వప్న హరికృష్ణ తనను వివాహం చేసుకోవాలని మౌన దీక్ష చేస్తున్న విషయం విధితమే. స్వప్న దీక్షకు ఐద్వా తరఫున సంఘీభావం తెలిపారు. హరికృష్ణ తన మొండి వైఖరిని మాని వెంటనే స్వప్నను వివాహం చేసుకోవాలని జిల్లా కార్యదర్శి మాచర్ల భారతి గారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆమెమాట్లాడుతూ స్వప్నకు న్యాయం జరిగేంత వరకు ఆమె పోరాటానికి మద్దతుగా నిలబడి ఉంటామని స్వప్నను మాయ మాటలు చెప్పి వంచించి గర్భవతిని చేసి, అబార్షన్ చేయించి ఈరోజు స్వప్నను పెళ్లి చేసుకోనని అనటం ఎంతవరకు సమంజసం అని అన్నారు .హరికృష్ణ వెంటనే స్వప్నను వివాహం చేసుకోవాలని,లేకపోతే ఐద్వా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున స్వప్న తరపున పోరాటం చేస్తామని హెచ్చరించారు. గ్రామంలో గతంలో ఒక బాలిక విషయంలో అన్యాయం జరిగితే హరికృష్ణ తండ్రి ఆ బాలిక తరపున నిలబ డ్డారని, న్యాయం అనే విషయంలో, తన కొడుకు విషయంలో స్వప్నకు అన్యాయం జరిగేలాగా ప్రవర్తించటం సరైనది, కాదని అన్నారు.అలాగే ఊరు జనమంతా స్వప్నకు మద్దతుగా నిలబడాలని అప్పుడే భవిష్యత్తులో ఆడపిల్లలకు ఇలాంటి పరిస్థితి పునరావతం కాకుండా ఉంటుందని, అలాగే సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే మర్లపాడు గ్రామానికి విచ్చేసి తన కార్యక్రమాన్ని నిర్వహించుకుని వెళ్లారని 10 రోజులకు పైగా దీక్ష వహించిన బాధితురాలైన స్వప్నను పరామర్శించ కపోవడం విచారకరమ ని, దురదృష్టకర మని అన్నారు. ఈ విష యం లో ఎమ్మెల్యే చొరవ తీసుకోవాలని స్వప్నకు న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు .ఈ కార్యక్రమంలో కల్లూరు ఇద్వా మండల కార్యదర్శి తన్నీరు కృష్ణవేణి తదితర మహిళలు పాల్గొ న్నారు.
-----------------------
Admin